ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘కియా సోరెంటో’ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 4, 2026న ఈ ప్రీమియం కారు అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కియా సంస్థ నుండి భారతదేశంలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్తో వస్తున్న మొట్టమొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్ ఇదే కావడం విశేషం. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో కియా బ్రాండ్ ఇమేజ్ను ఈ కారు మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు.
Also Read : బ్యాలెట్ విధానంలోనే స్థానిక ఎన్నికలు..!
ఈ కియా సోరెంటో కారులో పవర్ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను అందిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ప్రకారం చూస్తే ఇందులో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ సిస్టమ్తో పాటు, కియా కార్నివాల్లో వాడే 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. వీటికి తోడు ఈ మోడల్లో ‘లైవ్ జెన్ ఏఐ’ పేరుతో సరికొత్త ఏఐ ఆధారిత ఇన్-కార్ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీని కూడా జోడించారు. దీనివల్ల డ్రైవర్ లేదా ప్రయాణికులు కారుతో సహజంగా మాట్లాడుతూనే లోపల ఉండే పలు ఫీచర్లను వాయిస్ కమాండ్స్ ద్వారా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
Also Read : విజయ్ ఇంటి పక్కనే త్రిష కొత్త ఇల్లు..?
భారతదేశంలోనే ఈ కారును భారీగా లోకలైజ్ చేస్తుండటం వల్ల దీని ధర ఎక్స్-షోరూమ్ సుమారు రూ.30 లక్షల నుండి రూ.35 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వేరియంట్లు మరియు ఫీచర్లను బట్టి కొన్ని మోడళ్ల ప్రారంభ ధర రూ.40 లక్షల వరకు కూడా వెళ్లవచ్చని మార్కెట్ అంచనా. మార్కెట్లోకి వచ్చాక ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్ కలిగిన ఫోక్స్వ్యాగన్ టేరన్, స్కోడా కొడియాక్ మరియు జీప్ మెరిడియన్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

