ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మిత్రపక్షాల నడుమ కూటమి ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జనసేన సీనియర్ నేత, మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కూటమి ధర్మానికి కట్టుబడి ఉంటూనే.. ప్రత్యేక కార్యాచరణతో జనసేన ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : కావ్య – కాలభైరవ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..?
రాబోయే స్థానిక పోరులో జనసైనికులు, వీరమహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో కాకుండా, జనసేన పార్టీకి స్పష్టమైన క్యాడర్, గెలిచే బలం ఉన్న నియోజకవర్గాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ అసలు బలాబలాలు, సానుకూలతలు ఏంటో నిష్పక్షపాతంగా అంచనా వేసేందుకు 14 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగి కసరత్తు చేస్తోంది.
Also Read : కేఏ పాల్ ని కదిపి బొత్స పరువు పోగొట్టుకున్నాడా?
తెలుగుదేశం, బీజేపీలతో ఉన్న సఖ్యత చెడకుండా.. అదే సమయంలో పార్టీ శ్రేణులకు సముచిత స్థానం మరియు బలమైన ప్రాతినిధ్యం దక్కేలా సమన్వయ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీకి ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తూ, క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ 14 మంది కమిటీ ఇచ్చే క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగానే సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో చర్చలు జరపనున్నారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూనే, ఎక్కడా పార్టీ శ్రేణుల నైరస్యానికి గురికాకుండా, రాబోయే స్థానిక పోరులో జనసేన మార్క్ స్పష్టంగా కనిపించేలా అడుగులు వేయాలని అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది.

