Saturday, July 18, 2026 01:56 AM
Saturday, July 18, 2026 01:56 AM

ఒత్తిడి అనుకుంటే పొరపాటే.. అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చా..?

ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో విపరీతమైన మానసిక అలసట, మతిమరుపు, తలనొప్పి వంటి సమస్యలను చాలా మంది కేవలం ఒత్తిడి లేదా నిద్రలేమిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, కొన్ని అరుదైన సందర్భాలలో ఇవి మెదడులో వచ్చే అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ యొక్క ప్రాథమిక హెచ్చరిక సంకేతాలు కావచ్చునని ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అనిల్ థక్వానీ వివరించారు. సాధారణ అలసట విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది, కానీ ఈ ట్యూమర్ లక్షణాలు రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతూ మరింత దారుణంగా మారుతాయి.

Also Read : వర్షాకాలంలో వణుకు పుట్టిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్లు..!

ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ మతిమరుపు కాకుండా.. రోజువారీ వంటలు చేయడం, చిన్న అకౌంట్లు చూసుకోవడం వంటి అలవాటైన పనులను కూడా పూర్తిగా మర్చిపోవడం దీని ముఖ్య లక్షణం. అలాగే, ఈ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి రాత్రి పూట ఎక్కువగా ఉండటం, దగ్గినప్పుడు లేదా వంగినప్పుడు తీవ్రం కావడం మరియు వాంతులు అవ్వడం వంటి లక్షణాలతో కూడి ఉంటుంది. దీంతో పాటు అకస్మాత్తుగా తీవ్ర కోపం రావడం, మాటలు తడబడటం, కంటి చూపు మసకబారడం మరియు పెద్ద వయసులో జీవితంలో మొదటిసారి ఫిట్స్ రావడం వంటివి బ్రెయిన్ ట్యూమర్‌ కు ప్రధాన ప్రమాద సంకేతాలు.

Also Read : అమెరికా స్టూడెంట్ వీసా రూల్స్‌లో సంచలన మార్పులు..!

సాధారణ తలనొప్పి ఉన్న ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఈ లక్షణాలు వరుసగా కనిపిస్తూ పెరుగుతుంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి. దీని నిర్ధారణ కొరకు ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలు ఎంతో సహాయపడతాయి. ఒకవేళ ట్యూమర్ గుర్తిస్తే.. న్యూరో సర్జన్లు, ఆంకాలజిస్టులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం సర్జరీ లేదా రేడియేషన్ ద్వారా సమర్థవంతమైన చికిత్సను అందిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

స్థానిక ఎన్నికల్లో వెనక్కి...

ఏపీ లో రాబోయే స్థానిక సంస్థల...

ఇప్పుడైనా ఆ పదవులు...

ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?...

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోల్స్