Wednesday, July 15, 2026 02:17 AM
Wednesday, July 15, 2026 02:17 AM

సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ ఖాయమా..?

భారత టీ20 క్రికెట్ జట్టు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాల నేపథ్యంలో, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పునరాగమనంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వర్గాల నుంచి కీలక సమాచారం వచ్చింది. భారత్‌ కు 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ ను అందించిన సూర్యకుమార్, ఆ తర్వాత బ్యాటింగ్‌ లో ఫామ్ కోల్పోవడంతో కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టులోనూ స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ ను కొత్త టీ20 కెప్టెన్‌ గా బీసీసీఐ నియమించింది.

Also Read : సీమలో భూమి బంగారం..! ఎకరా ధర వింటే షాక్..!

అయితే, అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. ఐర్లాండ్‌ తో జరిగిన సిరీస్‌ లో 2-0తో వైట్‌ వాష్‌ కు గురైన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ను 4-0తో దారుణంగా కోల్పోయింది. జట్టు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో, సూర్యకుమార్‌ కు అంతర్జాతీయ క్రికెట్ తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అతను భవిష్యత్తు ప్రణాళికల్లో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌ లో స్థిరంగా పరుగులు సాధిస్తే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ నుంచి సంకేతాలు వచ్చాయి.

Also Read : హిందూ ఓటర్లను వదిలేద్దాం.. వైసీపీ తెలివిగా ఆడుతోందా..?

సూర్యకుమార్ యాదవ్‌ కు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి, అతను డొమెస్టిక్ క్రికెట్‌ లో రాణిస్తే పునరాగమనం ఖాయం” అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు సమాచారం. సౌతాంప్టన్‌లో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లాండ్ చేతిలో 56 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ భారీ టీ20 పరాజయాల పరంపరను పక్కన పెట్టి, టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌ తో జరగబోయే వన్డే సిరీస్‌ పై దృష్టి సారిస్తోంది. ఈ సిరీస్ ద్వారా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వస్తుండటంతో భారత్ మళ్లీ పుంజుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్...

గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార...

చంద్రబాబుకు ఉన్న నీటి...

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్...

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

పోల్స్