Saturday, July 11, 2026 08:56 AM
Saturday, July 11, 2026 08:56 AM

ఆ ముగ్గురి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, రోజుకో మలుపు తిరుగుతూ చివరకు పార్టీ అగ్రనాయకత్వం వైపు దూసుకువస్తుంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తీసుకున్న ఒక కీలక నిర్ణయం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా చేరుస్తూ సిట్ తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

Also Read : క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. భారత్‌ లో ‘బిగ్ బాష్ లీగ్’..!

ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును దాదాపుగా కొలిక్కి తెచ్చిన సిట్, నిందితుల జాబితాలో కొత్తగా ఈ ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్యులను చేరుస్తూ సప్లిమెంటరీ చార్జ్ షీట్ సిద్ధం చేసింది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణుల ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కేసుల విచారణ మధ్యలో కొత్త నిందితులను చేర్చాల్సి వచ్చినప్పుడు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం ఒక పద్దతి. సిట్ కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ అభియోగపత్రంతో పాటే కోర్టులో మెమో దాఖలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాంకేతికపరమైన అనుమతులు కూడా లభించడంతో, ఈ ముగ్గురిపై అధికారికంగా చట్టపరమైన చర్యలు ముందుకు పడనున్నాయి.

సిట్ దర్యాప్తులో తేలిన గణాంకాలు, తేదీలు ఈ కేసు తీవ్రతను బహిర్గతం చేస్తున్నాయి. ముఖ్యంగా 2023 నవంబరు 15 నుంచి నవంబరు 30వ తేదీ వరకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత ఉధృతంగా సాగినట్లు సిట్ గుర్తించింది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 4,013 మందిపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో 618 మందికి సంబంధించిన ఫోన్ సంభాషణలను అత్యంత అక్రమ పద్ధతిలో వినేందుకు ఎస్ఐబీ ప్రయత్నించినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల వ్యూహాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ భారీ ట్యాపింగ్ నెట్‌వర్క్ పనిచేసిందని స్పష్టమవుతోంది.

Also Read : ముద్దు సన్నివేశాలపై సాయి పల్లవి ఘాటు కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానా నిందితుడు, ఎస్ఐబీ మాజీ సీహెచ్‌ఓ ప్రభాకర్ రావు నియామకం వెనుకా ఉన్న మతలబులను సిట్ మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉంది. విచారణలో భాగంగా ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో పాటు, గత ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసిన ఉన్నతాధికారుల వాంగ్మూలాలు బీఆర్ఎస్ ముఖ్యులకు ఉచ్చుగా మారాయి. గత ప్రభుత్వంలో సీఎంఓ, హోంశాఖలో పనిచేసిన ఉన్నతాధికారుల నుంచి సిట్ ఇటీవలే కీలక వాంగ్మూలాలను సేకరించింది. తమపై ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దల ఒత్తిడి వల్లే, వారి ఆదేశాల మేరకే తాము పనిచేయాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక మాజీ డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్యుల పాత్రపై సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించగలిగింది. అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ ముగ్గురు నేతల పాత్ర ఏమిటనేది సిట్ తన అభియోగపత్రంలో క్షుణ్ణంగా పొందుపరిచింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు అందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో. నిధుల సమీకరణలో అక్రమ నిఘా ఏ విధంగా ఉపయోగపడిందనే కోణంలో ఒక ప్రముఖుడి పాత్రపై గట్టి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

హెచ్-1బీ వీసా, గ్రీన్...

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే హెచ్-1బీ...

పోల్స్