Friday, July 3, 2026 09:41 PM
Friday, July 3, 2026 09:41 PM

అన్నం తిన్న తర్వాత విపరీతమైన బద్ధకం, నీరసం వస్తున్నాయా..?

మనం మధ్యాహ్నం చక్కగా అన్నం, పప్పు తిన్న తర్వాత కాసేపటికే విపరీతమైన నీరసం రావడం, ఆవలింతలు రావడం, కళ్ళు అస్సలు తెరవలేకపోవడం వంటివి చాలా మంది అనుభవించే ఉంటారు. చాలా మంది దీనిని ఎండ తీవ్రత అనో, సరిగ్గా నిద్రపోకపోవడం అనో లేదా వయసు పైబడటం వల్లనో జరుగుతుందని సరిపెట్టుకుంటారు. కానీ, దీని వెనుక అసలు కారణం మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడమేకావచ్చు. మనం తినే ఆహారానికి మన శరీరం స్పందించే తీరే ఈ మధ్యాహ్నపు బద్ధకానికి ప్రధాన కారణం.

Also Read : పవర్ శాఖలో పవర్‌ ఫుల్ గేమ్స్..? టెండర్లకు ముందే కాంట్రాక్టర్లు ఫిక్స్..?

మనం రోటీ, అన్నం లేదా బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మన శరీరం వాటిని గ్లూకోజ్‌ గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్ రక్తంలోకి ప్రవేశించగానే, ప్యాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్‌ ను విడుదల చేసి ఆ గ్లూకోజ్‌ ను కణాలకు శక్తిగా మారుస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. అయితే, మనం తీసుకునే ఆహారం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ చాలా వేగంగా పెరిగితే, దానిని పోస్ట్‌ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో చేసే ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ నార్మల్‌ గా ఉన్నప్పటికీ, చాలా మందిలో తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో ఆ సీన్…!

మనకు షుగర్ వ్యాధి లేకపోయినా, ప్రతిరోజూ తిన్న తర్వాత ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోవడం వల్ల శరీరం ఒక్కసారిగా నీరసించిపోతుంది. మంచి భోజనం తిన్న గంటన్నరకే మళ్లీ ఏదైనా స్నాక్స్ తినాలనే బలమైన కోరిక కలుగుతుంది. ఇది మీ విల్‌ పవర్ లోపం కాదు, షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఆకలి హార్మోన్లు ఇచ్చే సిగ్నల్స్. ఇలా ప్రతిరోజూ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు గురికావడం వల్ల శరీరంలో అంతర్గత వాపులు ఏర్పడతాయి. ఇది కాలక్రమేణా ఫ్యాటీ లివర్, పిసిఓఎస్, గుండె జబ్బులు మరియు చివరకు డయాబెటిస్‌ కు దారితీస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్