రాజకీయ ఉద్రిక్తతలు, తీవ్ర వివాదాల కారణంగా గత ఏడాది కాలంగా నిలిచిపోయిన భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు చివరకు మళ్లీ పుంజుకోనున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాల కారణంగా రద్దయిన ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లతో కూడిన సుదీర్ఘ సిరీస్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
Also Read : మావిగన్ సరే.. మరి విశాఖ మాటేమిటి..?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే అభ్యర్థనలను భారతదేశం తిరస్కరించడంతో గతేడాది రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఢాకాలో చోటుచేసుకున్న నిరసనల కారణంగా భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని గత ఏడాది ఆగస్టులో జరగాల్సిన సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకుంది. ఈ వివాదాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కలకతా నైట్ రైడర్స్ జట్టు పక్కన పెట్టడం, అలాగే భద్రతా కారణాల వల్ల 2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం వంటి పరిణామాలు క్రికెట్ బంధాన్ని పూర్తిగా దెబ్బతీశాయి.
Also Read : మహీంద్రా సరికొత్త రికార్డు.. చరిత్రలోనే తొలిసారిగా..!
అయితే ప్రస్తుతం నెలకొన్న మంచు వీడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ టీవీ మరియు డిజిటల్ మీడియా హక్కుల అమ్మకానికి మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. ఈ రహస్య టెండర్లలో భారత్ తో జరిగే సిరీస్ను కూడా చేర్చడం విశేషం. జూలై 2 నుండి ప్రారంభమైన ఈ బిడ్డింగ్ ప్రక్రియ జూలై 22 నాటికి ముగియనుంది. సాధారణంగా భారత జట్టు పర్యటనకు బ్రాడ్కాస్టర్లు భారీగా పోటీ పడతారు, కాబట్టి బీసీసీఐ నుంచి క్లియర్ గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే బీసీబీ ఈ మీడియా హక్కుల అమ్మకాన్ని చేపట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

