Saturday, September 19, 2026 12:20 PM
Saturday, September 19, 2026 12:20 PM

భారత్ పై పాక్ దే విజయం.. అమెరికా సంచలన కామెంట్

ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా జోక్యం, అక్కడి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. కాల్పుల విరమణ ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విమర్శలకు వేదికగా మారాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పాక్ భూభాగంలో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతిస్పందించే ప్రయత్నం చేయడం, దాడులకు దిగడం వంటివి జరిగాయి.

Also Read : మళ్ళీ కెప్టెన్ గా రోహిత్..? గిల్ కష్టమే..?

ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం, కాల్పుల విరమణ చేస్తున్నట్టు భారత్ – పాకిస్తాన్ ప్రకటించడం జరిగాయి. అప్పటి నుంచి పదుల సార్లు ట్రంప్.. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడారు. తానే బెదిరించా అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఇదే తరహాలో అమెరికా కాంగ్రెస్ కూడా మాట్లాడింది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంపై పాకిస్తాన్ సైనిక విజయం అంటూ అభివర్ణించింది. దీనితో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. చైనా ఆయుధాలను పాక్ సమర్ధవంతంగా వాడినట్లు పేర్కొంది.

Also Read : అక్కడ హిడ్మాపై అభిమానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

మే 7 భారత్ మరియు పాక్ దేశాల మధ్య జరిగిన ఘర్షణలో చైనా పాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం చైనా ఆయుధాలపై ఆధారపడిందని, చైనా నిఘా వ్యవస్థను వాడుకుని దాడులకు దిగిందని తెలిపింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ట్రంప్ ఇప్పటి వరకు 60 సార్లు ఈ ప్రకటనలు చేసారని, భారతీయులను అమెరికా అవమానిస్తుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్