Friday, July 3, 2026 09:57 PM
Friday, July 3, 2026 09:57 PM

రోజాకు బై బై చెప్పిన జగన్..!

నగిరి నియోజకవర్గంలో కీలక పరిణామాల దిశగా రాజకీయం మారుతుంది. ముఖ్యంగా వైసీపీలో రాజకీయం ఆసక్తిని రేపుతుంది. నగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె వరుసగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు. ఇక అక్కడి నుంచి ఆమెకు కష్టాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా చిత్తూరు జిల్లా నాయకత్వం ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజాను మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేశారు.

Also Read : ఫాంలోకి వచ్చిన కెప్టెన్.. మరి మాజీ కెప్టెన్..?

అధిష్టానం వద్ద రోజా దీనిపై ఫిర్యాదు చేసినా సరే.. ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రోజాకు నియోజకవర్గంలో చెక్ పెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. నగిరి నియోజకవర్గంలో గాలి జగదీష్ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల వైయస్ జగన్ తో భేటీ అయిన గాలి జగదీష్.. పార్టీలోకి వచ్చే విషయంలో సానుకూలంగా ఉండటంతో అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గంలో గాలి జగదీష్ కు సీట్ ఇవ్వడానికి జగన్ కూడా సిద్ధంగానే ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

నియోజకవర్గంలో ఆయన సోదరుడు గాలి భాను ప్రకాష్.. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లో తన అన్న కంటే కాస్త గాలి జగదీష్ సీనియర్. అటు తన తండ్రికి కూడా చిత్తూరు జిల్లాలో మంచి పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని గాలి జగదీష్ భావించినా గాలి భాను ప్రకాష్ కు అధిష్టానంతో సైలెంట్ గా సీటు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read :రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయినా సరే గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో గాలి జగదీష్ వస్తే కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక జగదీష్ వస్తే నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్