Wednesday, July 22, 2026 10:20 PM
Wednesday, July 22, 2026 10:20 PM

భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్..!

సొంతంగా విదేశీ ప్రయాణాలు చేసే భారత పౌరులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇకపై అర్హులైన భారత పాస్‌ పోర్ట్ హోల్డర్లు యూఏఈ చేరుకున్న తర్వాతే నేరుగా వీసా ఆన్ అరైవల్ పొందేందుకు నిబంధనలను మరింత సరళతరం చేసింది. అయితే, కేవలం భారతీయ సాధారణ పాస్‌ పోర్ట్ ఉన్నంత మాత్రాన ఈ సదుపాయం లభించదని, ప్రయాణీకులు తమ పాస్‌ పోర్ట్‌ తో పాటు నిర్దేశిత దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతిని కలిగి ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Also Read : ఢిల్లీని వణికించిన కాంగ్రెస్ ధర్నా.. చెమటలు పట్టించారా..?

గతంలో కేవలం అమెరికా, బ్రిటన్, లేదా ఏదైనా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన వాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయులకు మాత్రమే యూఏఈ ఈ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పించేది. కానీ, ఇటీవలి సవరణల ప్రకారం ఈ జాబితాను మరింత విస్తరించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు ఉన్న భారతీయ పౌరులు కూడా యూఏఈలో నేరుగా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : పార్లమెంట్‌ లో చర్చకు కేంద్రం సిద్ధం..? మోడీ కీలక ప్రకటన..!

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే భారతీయుల సాధారణ పాస్‌ పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉండాలి. దాంతో పాటు సదరు ఆమోదిత దేశాల వాలిడ్ వీసా లేదా గ్రీన్ కార్డ్‌ ను ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ కోసం వెంట ఉంచుకోవాలి. ఈ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి సాధారణంగా యూఏఈలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీసా మంజూరు చేస్తారు. అవసరమైతే నిర్దేశిత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరియు ఫీజులను చెల్లించి, ఈ గడువును మరో 14 రోజుల పాటు ఒకసారి మాత్రమే పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజీ కోసం జగన్...

ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ...

విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి...

జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు...

ఆ కేసు విచారణ.....

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి...

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

పోల్స్