Saturday, June 20, 2026 07:37 PM
Saturday, June 20, 2026 07:37 PM

తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!

తమిళ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఆసక్తి రేపుతోన్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపైకి చేరుకున్న త్రిషను చూసేందుకు భక్తులు మరియు అభిమానులు ఎగబడ్డారు.

Also Read : జర్నలిజం ముసుగులో భజన.. మీరు మారరా..!

నేడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో త్రిష తిరుమలకు రావడం విశేషం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై మరియు ఇతర రాజకీయ సమీకరణాలపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, త్రిష స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం. అందరి కళ్లు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పైనే ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా వంటి కొన్ని సర్వేలు విజయ్ పార్టీ 98 నుండి 120 స్థానాల వరకు గెలుచుకుని కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని అంచనా వేశాయి.

Also Read : రంగస్థలం రేంజ్ లో.. చిట్టిబాబుకు మించిన క్యారెక్టర్..!

హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలతో, అభ్యర్థులు చేజారకుండా విజయ్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులను మహాబలిపురంలోని రిసార్ట్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసాడు విజయ్. గతంలో విజయ్‌ తో కలిసి నటించిన త్రిష, ఆయన రాజకీయ అరంగేట్రం సక్సెస్ అవ్వాలని కోరుకున్నారా..? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, అజిత్ సరసన విడా ముయర్చి, వంటి సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్