టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రంగస్థలం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన, సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించాయి. కమర్షియల్ సినిమాల ఫార్మాట్ ను మారుస్తూ వచ్చిన ఆ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సుమారు ఏడేళ్ల తర్వాత అదే మేజిక్ ను రిపీట్ చేసేందుకు ఈ బ్లాక్ బస్టర్ కాంబో.. రంగంలోకి దిగింది. ఆర్సీ 17 గా పిలవబడుతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : సీఎం చంద్రబాబు.. పవన్ క్లారిటీ.. లోకేష్ మౌనం..!
ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉండగా, చరణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ పెద్ది పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా గ్రాండ్ లాంచ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?
రంగస్థలంకు పని చేసిన దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న పెద్ది సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మళ్ళీ రామ్ చరణ్ ను సుకుమార్ ఏ రకమైన ఊరమాస్ లుక్ లో చూపిస్తాడో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం కన్నడ హీరోయిన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ కనపడుతోంది.

