మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక భారీ మైథలాజికల్ యాక్షన్ విజువల్ వండర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్బస్టర్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్పైకి వెళ్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిలిం ఛాంబర్లో గాడ్ ఆఫ్ వార్ మరియు దేవసేనాపతి అనే రెండు అత్యంత పవర్ఫుల్ టైటిళ్లను రిజిస్టర్ చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read : మానవ్ సుతార్ సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టార్ అతనే..!
ఈ సినిమా పూర్తిగా హిందూ పురాణాల్లోని శివపార్వతుల పుత్రుడు, యుద్ధ దేవుడైన కుమారస్వామి కథాంశం స్ఫూర్తితో రూపొందనుంది. ఈ చిత్ర అధికారిక అనౌన్స్మెంట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేస్తూ.. కుమారస్వామి పవర్ఫుల్ ఆయుధమైన వేల్ ను చూపిస్తూ, దాని నుండి ఒక డీఎన్ఏ స్ట్రాండ్ ఉద్భవిస్తున్నట్లు చూపించిన విజువల్స్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాయి. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా విజువల్ ఎపిక్ను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, ఎస్. రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read : శరీరంలో దాగున్న పాత వైరస్లను కరోనా నిద్రలేపుతోందా..?
దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ యాక్షన్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత, 2027 ద్వితీయార్థంలో ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రిజిస్టర్ చేసిన ఈ రెండు టైటిళ్లలో త్రివిక్రమ్ దేనిని ఫైనల్ చేస్తారనే దానిపై త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది.

