Thursday, May 28, 2026 10:15 PM
Thursday, May 28, 2026 10:15 PM

ట్రెడ్‌ మిల్‌ పై వాకింగ్ మంచిదా..? రన్నింగ్ మంచిదా..?

తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలనుకునే వారికి ట్రెడ్‌ మిల్‌ పై ఇన్‌ క్లైన్ విధానం ఒక ఉత్తమ ఎంపిక అంటున్నారు నిపుణులు. ట్రెడ్‌ మిల్‌ ను 10% ఇన్‌ క్లైన్‌ పై ఉంచడం వల్ల శరీరం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలోని పెద్ద కండరాల సమూహాలైన గ్లూట్స్, హామ్‌ స్ట్రింగ్స్, కాఫ్స్ మరియు కోర్ కండరాలు ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. అయితే, బరువు తగ్గడానికి ఈ 10% వాలుపై నడవడం మంచిదా లేదా పరుగెత్తడం ప్రభావవంతంగా ఉంటుందా అనేది వారి ఫిట్‌ నెస్ లెవెల్ పై ఆధారపడి ఉంటుంది.

Also Read : ఏపీ మైనింగ్ కుంభకోణంపై ఈడీ గురి..? అరెస్ట్ లు ఖాయమా..?

10% ఇన్‌ క్లైన్ వాకింగ్ అనేది ప్రారంభకులు, ఊబకాయంతో బాధపడేవారు లేదా మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా సురక్షితమైనది. నిటారుగా ఉన్న వాలుపై నడవడం వల్ల మోకాళ్లు, మడమలు మరియు కీళ్లపై పడే ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. రన్నింగ్‌ తో పోలిస్తే ఇన్‌ క్లైన్ వాకింగ్‌ ను ఎక్కువ సమయం.. ఉదాహరణకు 45 నిమిషాలు సులభంగా కొనసాగించవచ్చు. ఇది శరీరానికి ఎక్కువ శ్రమ లేకుండా దీర్ఘకాలంలో స్థిరంగా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మరియు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Also Read : అధికారం కోసం విధ్వంసం.. గులాబీ నేత అసలు రూపం..!

మరోవైపు, ఇన్‌ క్లైన్ రన్నింగ్ అనేది ప్రతి నిమిషానికి బర్న్ అయ్యే కేలరీల శాతాన్ని వేగంగా పెంచుతుంది. ఇది స్టామినాను, గుండె ఆరోగ్యాన్ని త్వరగా మెరుగుపరుస్తుంది. అయితే, సరైన అవగాహన లేకుండా 10% వాలుపై విపరీతంగా పరుగెత్తడం వల్ల పిక్కల కండరాల ఒత్తిడి, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. రన్నింగ్ వేగంగా కేలరీలను బర్న్ చేసినప్పటికీ, బరువు తగ్గడంలో గాయాలు కాకుండా చూసుకోవడమే ముఖ్యం. కాబట్టి మొదట ఇన్‌ క్లైన్ వాకింగ్‌తో ప్రారంభించి, స్టామినా పెరిగిన తర్వాత మధ్యమధ్యలో ఇన్‌ క్లైన్ రన్నింగ్ చేయడం ఉత్తమమైన మార్గం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కష్టపడిన వారికి గుర్తింపు...

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది...

అధికారం కోసం విధ్వంసం.....

బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్...

ఏపీ మైనింగ్ కుంభకోణంపై...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

విరాళంలో వేమిరెడ్డి దంపతుల...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

పోల్స్