Tuesday, August 25, 2026 12:11 PM
Tuesday, August 25, 2026 12:11 PM

టెక్కీలకు ట్రంప్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం..!

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే ఐటీ నిపుణులకు, భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా 1,00,000 డాలర్ల అంటే సుమారు 96 లక్షలు చేసింది. ఈ మేరకు తాజాగా ట్రంప్ యంత్రాంగం సరికొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు, సాధారణ ఫీజులతో పాటు ఈ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఫెడరల్ కోర్టు ఈ ఫీజు పెంపును అడ్డుకున్నప్పటికీ, ప్రభుత్వం ఈ విధానాన్ని శాశ్వతం చేసేందుకు పట్టుబడుతోంది.

Also Read : సిబిఐ పై జగన్ గౌరవం.. న్యాయమూర్తులు, లాయర్లు షాక్

ఈ భారీ ఫీజు పెంపు ప్రభావం అత్యధికంగా భారతీయులపైనే పడనుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో దాదాపు 70 శాతం మంది భారతీయ నిపుణులే ఉన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం, విదేశాల నుండి నేరుగా ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే అమెరికాలో స్టూడెంట్ వీసాలపై ఉన్నవారికి మరియు వీసా రినెవల్ చేసుకునే వారికి ఈ అదనపు ఫీజు వర్తించదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read : నన్ను వేధించోద్దు ప్లీజ్.. అంబటి సంచలన కామెంట్స్..!

అమెరికా స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. తక్కువ జీతాలకే లభించే విదేశీ కార్మికులతో స్థానికులను భర్తీ చేయకుండా కంపెనీలను నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది ముగింపు దశకు వచ్చే అవకాశం ఉండటంతో, అమెరికా వ్యాపార వర్గాలు మరియు ఐటీ సంస్థలు దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నన్ను వేధించోద్దు ప్లీజ్.....

కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం తన...

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

పోల్స్