దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మొత్తం ఆరు అద్భుతమైన పాటలను రెడీ చేసినట్లు సమాచారం.
Also Read : భారత్లోకి యాపిల్ పే ఎంట్రీ.. లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఇవే..!
తాజా సమాచారం ప్రకారం, ఈ ఆరు పాటలకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ ఇప్పటికే పూర్తిగా పూర్తయింది. ఇక వచ్చే నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులను ప్రారంభించడానికి కీరవాణి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాంతో ఈ వార్త ఇప్పుడు మహేశ్ బాబు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
Also Read : పైకి మాత్రమే సస్పెన్షన్.. వెనక మాత్రం..!
ఈ హై-బడ్జెట్ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు సరికొత్త లుక్లో కనిపించడమే కాకుండా.. ‘రుద్ర’, ‘శ్రీరాముడు’గా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు 80 శాతానికి పైగా మేకింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని, వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

