Friday, August 28, 2026 08:26 PM
Friday, August 28, 2026 08:26 PM

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు ఘోర పరిస్థితులు.. జపాన్‌పై బీసీసీఐ ఫైర్..!

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లోక్రీడాకారులకు కల్పిస్తున్న వసతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అక్కడ క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన నివాస, డ్రెస్సింగ్ రూమ్ సౌకర్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయంటూ జపాన్ ఒలింపిక్ అధికారుల తీరుపై బీసీసీఐ మండిపడింది. ఒకవేళ వసతులలో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ టోర్నమెంట్‌కు తమ ప్రధాన జట్టును కాకుండా ‘బి’ టీమ్‌ను పంపించే యోచనలో ఉన్నట్లు బోర్డు వర్గాలు సంచలన ప్రకటన చేశాయి.

Also Read : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా తెలుగు ఐఏఎస్..!

బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌లు నిర్మించకుండా, కేవలం టెంట్లు వేసి సరిపెట్టారు. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఆటగాళ్లు వాడుకునే వాష్ రూమ్‌లు ఆ టెంట్లకు దాదాపు ఐదు వందల మీటర్ల సుదూర దూరంలో ఉన్నాయి. దీనికి తోడు క్రీడాకారులకు కేటాయించిన హోటల్ గదులు కూడా అత్యంత చిన్నవిగా ఉండటం ఆటగాళ్ల మానసిక ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read : ఇలా అయితే మా వల్ల కాదు..!

అంతర్జాతీయ స్థాయి మెగా ఈవెంట్‌లో ఇలాంటి నాసిరకం ఏర్పాట్లు చేయడంపై ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలోనే జపాన్ అధికారులను బీసీసీఐ నిలదీసింది. గత చైనా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా, ఈసారి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సూపర్ స్టార్లతో కూడిన అత్యంత బలమైన ప్రధాన జట్టును ప్రకటించింది. మహిళల జట్టుకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత, సౌకర్యాలను పరిశీలించడానికి బీసీసీఐ త్వరలోనే ఒక ప్రత్యేక పరిశీలకుడిని జపాన్‌కు పంపనుంది. ఆ పరిశీలకుడు ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రధాన జట్టును పంపాలా, లేదా యువ ఆటగాళ్లతో కూడిన ‘బి’ జట్టును పంపాలా అనేదానిపై బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

పోల్స్