Thursday, July 23, 2026 07:32 PM
Thursday, July 23, 2026 07:32 PM

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధులను ఖాతాల్లో జమ చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పిల్లలే మన సంపద. వారి చదువులే మనకు తరగని ఆస్తి. విద్యే మన రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడి. ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేస్తూ, పిల్లలను చదివించే ప్రతి తల్లికీ వందనాలు తెలిపారు.

Also Read : జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్ కు రంగం సిద్దం..?

గతంలో ఉన్న నిబంధనలకు భిన్నంగా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ లబ్ధి వర్తింపజేసేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వరసగా రెండో ఏడాది కూడా విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ నిధులను విడుదల చేశామన్నారు. పథకంలో భాగంగా పాఠశాల, కళాశాల నిర్వహణ మినహాయింపులు పోను ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ అయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ భరోసాతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Also Read : అమరావతి నిర్మాణంలో కీలక మైలురాయి..!

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరి చదువులకు సంబంధించి మొత్తం 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ అకౌంట్లలో రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులైన తల్లుల ఖాతాల్లోకి ఈ నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి వివరించారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా, పారదర్శకంగా ప్రయోజనం అందేలా అధికారులు అన్ని చర్యలు పూర్తి చేశారు.

Also Read : బండ్ల గణేష్‌ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

విద్యా రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సరైన సమయంలో అందిస్తున్న ఈ ఆర్థిక సాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలకు కొండంత అభయాన్నిస్తోంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకునే తల్లులకు ఈ పథకం ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయం పట్ల లబ్ధిదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్...

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత,...

యుద్ధం కొనసాగితే 9/11...

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు...

సీజేపీ చీఫ్ అభిజిత్...

నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి...

వెలుగులోకి మరో వైసీపీ...

నీతి, నిజాయతీ అంటూ మాటలు చెప్పే...

అమరావతి నిర్మాణంలో కీలక...

నవ్యాంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ...

బండ్ల గణేష్‌ కు...

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల...

పోల్స్