Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

చలికాలం లెన్స్ వాడుతున్నారా..? అయితే ఇవి మిస్ కావొద్దు..!

చలికాలం వచ్చింది అంటే చాలు భారత్ లో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఢిల్లీలో చలికాలం పరిస్థితి ప్రతీ ఏటా దిగజారుతోంది. కాలుష్యానికి పొగ మంచు తోడు కావడంతో కంటి సమస్యలు కూడా ఎక్కువగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కాంటాక్ట్ లెన్స్ వాడే వారి విషయంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వాయు కాలుష్యం వీటిపై ఎక్కువగా ప్రభావం చూపే సంగతి తెలిసిందే.

Also Read : కోటంరెడ్డి సంచలనం.. వారి బాధ్యత నా కూతుళ్ళదే..!

పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం2.5 మరియు పీఎం10), దుమ్ము, పొగ, రసాయన కాలుష్య కారకాలు కంటిలోని సున్నితమైన పొరను చికాకు పెట్టడమే కాకుండా, లెన్స్‌లకు అతుక్కుని, కన్నీటి పొరను అంతరాయం కలిగించి, కార్నియాకు వ్యతిరేకంగా బ్యాక్టీరియాను బంధిస్తాయి. దీని కారణంగా.. మైక్రోబియల్ కెరాటిటిస్, డ్రై ఐ సిండ్రోమ్ మరియు కార్నియల్ అల్సర్‌ ల వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు ఎరుపు, జిగట, అస్పష్టమైన దృష్టి, అసౌకర్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనితో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

కళ్ళజోడులా కాకుండా, లెన్స్‌లు నేరుగా కంటిపై అతుక్కుని ఉంటాయి. ఇదే ఇక్కడ ప్రధాన సమస్య. చెత్తను పీల్చుకునే లెన్స్‌ ల వల్ల ఈ సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి.. రోజువారీ డిస్పోజబుల్ లెన్స్‌ లను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అవి రాత్రిపూట కణాలు, బ్యాక్టీరియా పేరుకుపోకుండా కంట్రోల్ చేస్తాయి. లెన్స్‌ లను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. స్టెరైల్ మల్టీపర్పస్ ద్రావణాన్ని వాడాలి. పంపుల దగ్గర నీరు, లాలాజలంతో చేసుకోవడం మంచిది కాదు. లెన్స్‌ ను 20 సెకన్ల పాటు శుభ్రమైన వేళ్లతో సున్నితంగా రుద్దడం మంచిది.

Also Read : నెల్లూరు పోలీసుల సెన్సేషన్.. రౌడీల గుండెల్లో రైళ్ళు..!

అధిక కాలుష్య ప్రాంతాలలో, కాలుష్య కారకాలు త్వరగా పేరుకుపోతాయి. కాబట్టి మీరు బయట ఉంటే మధ్యాహ్నం శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కాలేజీలకు వెళ్ళేవారు.. మంచు పడే సాయంత్రం సమయాల్లో క్రీడల్లో పాల్గొనే సమయంలో దుమ్ముకి దూరంగా ఉండటం మంచిది. లెన్స్ లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా మేలు చేస్తుంది. ప్రిజర్వేటివ్ లేని లూబ్రికేటింగ్ డ్రాప్‌ లను తరచుగా వాడటం మంచిది కాదు. ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగడం మంచిది. స్క్రీన్ వాడే వారు.. 20-20-20 రూల్ ను ఫాలో కావడం మంచిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్