Wednesday, May 6, 2026 08:30 PM
Wednesday, May 6, 2026 08:30 PM

ఉక్రెయిన్ పై మోడీ యుద్ధం.. అమెరికా సంచలన కామెంట్స్

ఏళ్ళ తరబడి సాగుతోన్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రెండు దేశాలు కాల్పుల విరమణకు సిద్దంగా ఉన్నామని ప్రకటనలు చేసినా సరే మధ్యవర్తిత్వం మాత్రం సరిగా జరగని పరిస్థితి. ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ పై కూడా ఒత్తిడి చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై డోనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో సంచలన కామెంట్స్ చేసారు. ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధం మోడీ చేస్తున్నారని మండిపడ్డారు.

భారత్ రాయితీ చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేసారు. రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే భారత్ వెంటనే అమెరికా విధించే సుంకాలలో 25% తగ్గింపును పొందుతుందని స్పష్టం చేసారు. ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం కొంతవరకు న్యూఢిల్లీ ద్వారానే సాధ్యమన్నారు. మోడీ అనుకుంటే ఈ యుద్ధం ఆగుతుందని పేర్కొన్నారు. భారత్ పై మరిన్ని సుంకాలు విధించడానికి అమెరికా సిద్దంగా ఉందన్నారు.

భారత వస్తువులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నవారో ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్య దేశాలతో కలిసి పని చేయాల్సిన మోడీ.. నియంతలతో కలిసి ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఇది తనకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. మోడీ చాలా గొప్ప నాయకుడు అని, భారత్ ఎంతో పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అన్నారు. మనం ఎవరి నుంచి అయినా చమురు కొనుగోలు చేయవచ్చనే గర్వం భారతీయుల్లో ఉందని విమర్శించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్