Wednesday, August 5, 2026 03:35 AM
Wednesday, August 5, 2026 03:35 AM

జూనియర్ సెహ్వాగ్ అదిరిపోయే బ్యాటింగ్

ఒకప్పుడు క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అతని డాషింగ్ బ్యాటింగ్ గుర్తుకు వచ్చేది. బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ఆడే సెహ్వాగ్.. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పుడు అతని కొడుకు కూడా అదే బాటలో పయనిస్తూ తండ్రిని గుర్తు చేస్తున్నాడు. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. తన తండ్రి మాదిరిగానే భారీ షాట్ లతో విరుచుకుపడుతున్నాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో.. దుమ్ము రేపాడు ఆర్యవీర్ సెహ్వాగ్.

Also Read : రెండు పెన్షన్లు.. చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

తన తండ్రిలాగే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ క్రీజ్ లో సెటిల్ అయిన తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. దులీప్ ట్రోఫీ కోసం యష్ ధుల్ జట్టు నుంచి బయటకు వెళ్ళగా అతని స్థానంలో ఆర్యవీర్ జట్టులోకి వచ్చాడు. క్లిష్ట సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆర్యవీర్.. 16 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసినా.. దూకుడుగా బ్యాటింగ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అతనిని 8 లక్షలకు ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ కొనుగోలు చేసింది. అటు దేశవాళి మ్యాచుల్లో కూడా అతను దూకుడుగా ఆడుతున్నాడు.

Also Read : ట్రంప్ దెబ్బకు తమిళనాడులో ఆ నగరం ఖాళీ..!

వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో 49 పరుగులు చేసాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 200 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత రోజే అతను మరో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 309 బంతుల్లో 297 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 51 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని దూకుడు చూస్తున్న క్రికెట్ అభిమానులు.. త్వరలోనే జాతీయ జట్టులో అడుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్