Friday, July 3, 2026 11:00 PM
Friday, July 3, 2026 11:00 PM

గతం మర్చిపోయి నోరుజారిన కేసీఆర్

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే పార్టీ మారిన.. కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ లో ఓటమి ఖాయమన్నారు.

Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికర చర్చలకు దారితీస్తున్నాయి. 2014, 2018లో వరుసగా రెండుసార్లు గెలిచిన కేసీఆర్.. అసలు విపక్షాలు లేకుండా చేసి వాళ్లను తమ పార్టీలోకి తీసుకున్నారు. ఏకంగా టిడిపి, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను తమ పార్టీలో విలీనం చేసి కొత్త సంస్కృతికి తెర తీశారు. తనకు ప్రతిపక్షాల నుంచి ఇబ్బందులు ఉండకూడదని భావించిన కేసీఆర్.. 86 సీట్లు వచ్చినా సరే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా వ్యవహరించారు.

Also Read : అధికారులపై చంద్రబాబు సీరియస్..!

అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ నీతి వ్యాఖ్యలు చేయడంపై మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 2014లో గులాబీ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని తమ పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు లేకుండా చేశారు. 2018 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అలాంటి కెసిఆర్ ఇప్పుడు నీతులు చెప్పడంపై గులాబీ పార్టీ నేతలే షాక్ అవుతున్నారు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్