Monday, August 3, 2026 07:13 PM
Monday, August 3, 2026 07:13 PM

ఇండియాతో అమెరికా కామెడీ.. 30 రోజుల పర్మిషన్..!

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ద పరిస్థితులు, హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం, అటు నుంచి నౌకలు వెళ్తే పేల్చి వేస్తామని హెచ్చరికల నేపధ్యంలో ఇప్పుడు భారత్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. యుద్ధం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో భారత్ కు వచ్చే ఆయిల్ నిల్వలపై ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో అమెరికా.. భారత్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేసారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవచ్చన్నారు.

Also Read : స్వామి ఆశీస్సులతోనే కొత్త పార్టీ.. కవిత సంచలనం..!

భారత చమురు శుద్ధి కర్మాగారాలు.. రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల మినహాయింపును ప్రకటించారు. దీనితో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కు చెందిన, యొక్క విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం రష్యాకు సంబంధించిన లైసెన్స్‌ను జారీ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది అనే చెప్పాలి. వివిధ ఆంక్షలు, నిబంధనల ద్వారా అడ్డుకున్న ఓడలతో సహా.. ఆ అనుమతులు ఏప్రిల్ 3 వరకు ఉంటాయి అని అమెరికా తెలిపింది.

Also Read : నికోటిన్ గమ్ లు వాడుకోవచ్చా..?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఆందోళనల నేపధ్యంలో, ప్రపంచ ఇంధన మార్కెట్లను కంట్రోల్ చేసేందుకు అమెరికా ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. భారత్ అమెరికాకు ఎంతో కీలకమని.. కాబట్టి భారత్ అవసరాలను తాము దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా రష్యా, చైనా, పాకిస్తాన్ నౌకలను తాము అడ్డుకునేది లేదని ఇరాన్ పేర్కొంది. దీనితో భారత్ కు షాక్ తగిలింది. ఈ టైంలో అమెరికా ఇచ్చిన అనుమతులతో భారత్ కు ఉపశమనం లభించింది. ఏది ఏమైనా.. మన జేబులో డబ్బులతో ఏ బంకులో ఆయిల్ కొట్టించాలో.. అమెరికా ఆదేశించడం విడ్డూరమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

పోల్స్