Wednesday, July 22, 2026 04:58 AM
Wednesday, July 22, 2026 04:58 AM

పెద్దికి షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్ట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పెద్ది.. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం టాలీవుడ్‌లో సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ ను చిత్ర యూనిట్ తెలంగాణ హైకోర్టు నుండి అనూహ్యంగా విత్ డ్రా చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా బిజినెస్ సమీకరణాల నేపథ్యంలో రేట్ల పెంపు కోసం నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు కోర్టులో బ్రేక్ పడింది.

Also Read : కుల పిచ్చి దాటడమే పవన్ లక్ష్యమా..?

సినిమా విడుదలై మొదటి వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పెద్ది.. చిత్ర నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. గతంలో సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారాలపై కోర్టు ఇచ్చిన తీర్పులను, ప్రభుత్వ నిబంధనలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పాత తీర్పులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు ఎలాంటి ప్రత్యేక సానుకూల ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read : గోదావరి జిల్లాల్లో మళ్లీ టైగర్ టెన్షన్..!

కోర్టు అభిప్రాయాన్ని గమనించిన చిత్ర యూనిట్, తమ పిటిషన్‌ ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి స్పష్టం చేస్తూ ఉపసంహరించుకుంది. టికెట్ ధరల లీగల్ వివాదానికి తాత్కాలికంగా తెరపడటంతో, పెద్ది.. సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. హైకోర్టులో పిటిషన్ విత్‌ డ్రా చేసుకున్న నేపథ్యంలో, సాధారణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సినిమా టికెట్ల విక్రయాలు సాగనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్