Thursday, September 17, 2026 08:52 PM
Thursday, September 17, 2026 08:52 PM

ఇంగ్లాండ్ పై గెలిస్తే.. భారత్ కు సెంటిమెంట్ ప్లస్..?

లీగ్ దశలో ఈజీగా.. సూపర్ 8 లో కష్టంగా బయటపడిన టీం ఇండియా.. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో మరో కఠిన పరీక్షకు రెడీ అయింది. మొన్న సూపర్ 8 చివరి మ్యాచ్ లో విండీస్ పై చాలా ఈజీగా గెలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దీనితో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ భారత్ కంటే బలహీనంగా కనపడినా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లిష్ జట్టును తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదనే మాట వినపడుతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.

Also Read :విజయవాడకు మరో మెగా ప్రాజెక్టు..!

గురువారం ఐకానిక్ వాంఖడే స్టేడియంలో రెండవ సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా.. రెండుసార్లు టి వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్‌తో తలపడుతుండగా.. రెండు జట్లు టి20 ప్రపంచ కప్‌ లో వరుసగా మూడోసారి సెమీఫైనల్‌ లో తలపడుతున్నాయి. సెమీస్ లో.. గెలిచిన జట్టు ఖచ్చితంగా కప్ గెలుస్తోంది. రెండేళ్ల తర్వాత, 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ ను కొన్ని విషయాలు కలవరపెడుతున్నాయి.

Also Read : జూమ్ చేసి అసభ్యకరంగా చూపించొద్దు..!

ముఖ్యంగా.. భారత బ్యాటింగ్ లైనప్ ఆందోళన కలిగిస్తోంది. మొన్న సంజు సామ్సన్ ఆడకపోతే భారత్ ఓటమి పాలయ్యేది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఆందోళన కలిగిస్తున్నారు. బౌలింగ్ పరంగా కూడా భారత్ కు కొన్ని సమస్యలు ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ను వాడుకోవడం లేదనే విమర్శలు కూడా కొంత ఉన్నాయి. అర్షదీప్ సింగ్ పవర్ ప్లే లో ఫెయిల్ కావడం కూడా కంగారు పెట్టే అంశమే. ఇక సూర్యకుమార్ యాదవ్, శివం దూబే బ్యాటింగ్ పరంగా ఫెయిల్ కావడం కూడా కంగారు పెట్టే విషయమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్