అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో అమెరికా ఒక శాంతి ఒప్పందానికి వస్తే, తాను పాకిస్థాన్ లో పర్యటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణ, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల తగ్గింపు లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read : లక్నో సూపర్ జెయింట్స్కు బ్యాటింగ్ కష్టాలు..!
ఈ చర్చల్లో భాగంగా సానుకూల ఫలితాలు వస్తే, ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పాకిస్థాన్ పర్యటనను ఒక ఆప్షన్ గా ట్రంప్ భావిస్తున్నారు. ఒప్పందం కుదిరితే.. నేను ఖచ్చితంగా పాకిస్థాన్ వెళ్తాను అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ తో యుద్ధం చేయడం అమెరికాకు ఇష్టం లేదని, అయితే ఆ దేశం అణు ఆయుధాలను కలిగి ఉండకూడదనేది తమ ప్రధాన షరతు అని ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ పర్యటన గురించి ప్రస్తావించడం ద్వారా, ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు పాకిస్థాన్ ను ఒక మధ్యవర్తిగా లేదా వేదికగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : డయాబెటిస్ బాధితులకు వేసవిలో మజ్జిగ వరమేనా..?
దక్షిణాసియా రాజకీయాల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని నేను అనుకుంటున్నాను అంటూ ట్రంప్ పేర్కొన్నారు. యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నెవాడా, అరిజోనాల పర్యటనకు వెళ్తూ వైట్ హౌస్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసారు.

