Thursday, May 7, 2026 04:56 AM
Thursday, May 7, 2026 04:56 AM

కొడుకు కోసం తల్లి బంగారం అమ్మేసింది.. చివరకు..!

ఐపిఎల్ వేలం పాట అనగానే ఎందరో క్రికెటర్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వందలాది మంది ఆటగాళ్ల జీవితాలను మలుపు తిప్పే ఈ టోర్నమెంట్ కోసం.. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు లక్కీగా కోట్లు పలుకుతూ ఉంటారు. తాజాగా జరిగిన మినీ వేలంలో కార్తిక్ శర్మ అనే ఆటగాడు ఏకంగా 14 కోట్ల ధర పలికాడు. అప్పటి వరకు అతను ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అతనిని చెన్నై జట్టు ఏకంగా 14 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడంతో పేరు మార్మోగిపోయింది.

Also Read : ఏపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పవన్ అత్యవసర సమావేశం..!

ఇక ఇతని జీవితం మొత్తం కూడా కష్టాలే అంటోంది జాతీయ మీడియా. తినడానికి తిండి లేక రాత్రి సమయాల్లో షెల్టర్ లు, బస్టాండ్ లలో అతను పడుకునే వాడని, పస్తులు ఉండి క్రికెట్ కోసం కష్టపడినట్టు వెల్లడించింది. ఇక అతని క్రికెట్ ప్రయాణం గురించి అతని తండ్రి అనేక విషయాలు పంచుకున్నాడు. తమ సొంత ఊర్లో ఉన్న పొలం, ఇతర ఆస్తులను అమ్మేసామని, అతనికి శిక్షణ ఇవ్వడానికి తీవ్రంగా కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు. తన భార్య బంగారం కూడా అమ్మేసి.. కిట్ కొనిపెట్టింది అని గుర్తు చేసుకున్నాడు.

Also Read : ఆయన కోసం కొత్త పోస్టు సృష్టిస్తున్నారా..?

చిన్నప్పటి నుంచి కార్తిక్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అందుకే అతను పట్టుదలగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకున్నాడని, ఇప్పుడు వచ్చిన డబ్బుతో తమ కష్టాలు అన్నీ తీరిపోతాయని తెలిపాడు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన కార్తిక్ శర్మ దేశవాళి క్రికెట్ లో అంచనాలకు మించి రాణించాడు. మంచి హిట్టర్ గా కూడా అతనికి పేరు ఉంది. అతని తండ్రి కూడా ఒకప్పుడు క్రికెటర్ కావడం విశేషం. కానీ.. గాయం కారణంగా క్రికెట్ ను కొనసాగించలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్