Wednesday, May 6, 2026 09:19 PM
Wednesday, May 6, 2026 09:19 PM

ఆ కేసు బోగస్.. చంద్రబాబుకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు సంచలనంగా మారిన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయింది. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ సర్కార్.. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు చేసింది. కానీ తాజాగా ఈ కేసులో ఏ విధమైన అక్రమాలు లేవని సిఐడీ అధికారులు నిర్ధారించి కేసు క్లోజ్ చేసారు. ఏసీబీ కోర్ట్ కు ఈ మేరకు నివేదిక సమర్పించారు. కేసు క్లోజ్ చేయడంతో.. సిఎం చంద్రబాబు సహా మరో 15 మందికి ఊరట లభించినట్లు అయింది.

Also Read : తిత్తి తీస్తాం.. పవన్ సంచలన కామెంట్స్

అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఏ విధమైన ఆధారాలు తన వద్ద లేకపోవడంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలపడంతో.. కోర్ట్ లో అంగీకారం మేరకు కేసు క్లోజ్ చేసారు. ఒక్కసారి ఈ వ్యవహారం పూర్వాపరాలు చూస్తే.. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్‌ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారని, సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.

Also Read : విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!

ఈ కేసు నమోదు అయిన రెండేళ్ళ తర్వాత అంటే.. 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరును చేర్చారు. భారత్‌ నెట్‌ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించారనే ఆరోపణలు రుజువు కాలేదు. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపినా సరే ఆధారాలు లేకపోవడంతో.. అసలు అక్రమాలు జరగలేదు అని, ఆర్ధిక నష్టం జరగలేదని తేల్చారు. మధు సూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేయడంతో కేసు క్లోజ్ అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్