ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్, ప్రస్తుత 2026 సీజన్లో తీవ్ర పరాజయాలతో సతమతమవుతోంది. 10 మ్యాచ్ లు ఆడిన ముంబై, కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసు నుండి ముంబై దాదాపు నిష్క్రమించినట్లే కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ఆరంభం నుండే ఎదురుదెబ్బలు తగిలాయి.
Also Read : బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
మొదటి ఏడాది(2024) లో ముంబై 10 జట్లలో చివరి స్థానంలో నిలవడమే కాకుండా, సొంత మైదానం వాంఖడేలో హార్దిక్ అభిమానుల నుండి తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2025లో జట్టు 4వ స్థానానికి చేరుకుని పుంజుకున్నట్లు అనిపించినా, 2026 సీజన్ మళ్లీ పాత కష్టాలను తెచ్చిపెట్టింది. జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్రాంచైజ్ యాజమాన్యం పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం, ప్రకారం.. ఈ ఓటములకు హార్దిక్ నాయకత్వ లోపం కారణమని యాజమాన్యం భావించడం లేదట.
Also Read : ఇన్ అండ్ అవుట్.. ముహుర్తం ఫిక్స్..!
దానికి బదులుగా, ఆధునిక ఐపీఎల్ లో మారుతున్న ఆట శైలికి అనుగుణంగా జట్టు వేగంగా మారలేకపోవడమే ప్రధాన సమస్య అని వారు విశ్లేషిస్తున్నారని పేర్కొంది. ముంబై యాజమాన్యం దృష్టిలో ఆట శైలిని మార్చుకోవడం అంటే.. ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. పవర్ప్లే లోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్లు ఉండాలి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా వికెట్లు తీస్తూ పరుగులను నియంత్రించగల బౌలర్లు అవసరం. ప్రస్తుతానికి పాండ్యా నాయకత్వానికి డోకా లేకపోయినా, రాబోయే సీజన్లలో జట్టు ప్రదర్శనను మార్చడానికి భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ గడ్డు కాలాన్ని ముంబై ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

