Saturday, May 2, 2026 01:16 PM
Saturday, May 2, 2026 01:16 PM

టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..!

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఒక అద్భుతమైన, అరుదైన ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పేదరికాన్ని జయించి టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. చదువులో రాణించిన విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో, నియోజకవర్గ టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున భూమిని కానుకగా ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Also Read : మద్యం సేవించి సభకు వచ్చిన సీఎం..?

ఈ అరుదైన నజరానాకు కుంటిపూడికి చెందిన జస్మిత, శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సాయి పూజిత, మరియు తొండమనాడుకు చెందిన మోహిత్ చరణ్ ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏమాత్రం తక్కువ కాదని, సరైన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని ఈ విద్యార్థులు నిరూపించారని ఎమ్మెల్యే కొనియాడారు. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే ఈ భూమిని కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.

Also Read : బ్రేకింగ్: డిప్యూటి సీఎం పవన్‌ ఇంటికి చంద్రబాబు..!

సాధారణంగా విద్యార్థులకు నగదు బహుమతులు లేదా లాప్టాప్‌లు వంటివి ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఏకంగా నివాస స్థలాలను బహుమతిగా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం సదరు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, మిగిలిన విద్యార్థుల్లో కూడా చదువుపై మరింత ఆసక్తిని, పట్టుదలను పెంచుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ చొరవపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ప్రకృతి...

పోల్స్