Sunday, June 21, 2026 01:33 AM
Sunday, June 21, 2026 01:33 AM

పాస్టర్ ప్రవీణ్ కేసు.. ఏపీ పోలీసుల తీరుపై ప్రసంశలు

గత వారం రోజుల నుంచి సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యవహారంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. అతని వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి పోలీసులపైనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. పోస్ట్ మార్టం జరిగే సమయంలో కూడా పోలీసులనే టార్గెట్ చేసి నిరసన కార్యక్రమాలు చేసారు కొందరు. ఇక సోషల్ మీడియాలో కూడా పోలీసుల సమర్ధతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే పోలీసులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు.

Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?

ప్రవీణ్ పగడాల కేసు విషయంలో కొన్ని సంఘాలు నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చినా సరే పోలీసులు సాక్ష్యాలు చేతికి వచ్చే వరకు ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని వర్గాలు రెచ్చగొడుతున్నా సరే ఎక్కడా బాలన్స్ తప్పకుండా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా రాజమండ్రి ఎస్పీ ఈ కేసు విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించారు. అలాగే ఐజీ కూడా ఎక్కడా తొందరపాటు వ్యాఖ్యలు చేయలేదు. సున్నితమైన విషయం కూడా కావడంతో సాక్ష్యాలు చేతికి వచ్చే వరకు మాట్లాడలేదు.

Also Read : అప్పుడైతే అలా.. మరి ఇప్పుడో..!

అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ వచ్చిన వెంటనే.. డిమాండ్ కు తగ్గట్టు కేసు ఫైల్ చేసారు. పోస్ట్ మార్టం వీడియో రికార్డ్ కూడా చేయించారు పోలీసులు. రోడ్డు ప్రమాదాన్ని.. కొన్ని వర్గాలు కుట్రగా చూపించే ప్రయత్నం చేసినా.. అటు తెలంగాణా పోలీసులు, టోల్ గెట్ సంస్థలు, వైన్ షాపులు సహా.. పలువురి సహకారంతో కేసుకి వేగంగా ముగింపు ఇచ్చారు. అటు సోషల్ మీడియాలో కూడా కొందరు పోలీసులపై కాస్త దురుసుగా మాట్లాడినా.. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించారు. ఇక ప్రభుత్వ పెద్దలు సైతం ఈ విషయంలో ఎక్కడా తొందరపడి మాట్లాడకపోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్