Thursday, February 5, 2026 07:18 AM
Thursday, February 5, 2026 07:18 AM

ఏసీబీ కంటే ముందే.. కేటిఆర్ కు ఈడీ షాక్

తెలంగాణలో సంచలన రేపుతున్న ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేసు కూడా నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలను తీసుకున్న ఈ డి విచారణను వేగవంతం చేస్తోంది. ఈ కేసులో ముందు సాక్షులను విచారించాలని ఈడీ అధికారులు భావించినా ఆ తర్వాత కేటీఆర్ సహా ఇతర నిందితుల నుంచే విచారణ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Also Read : ఆర్బిఐ గవర్నర్ టూ ప్రధాని.. అవినీతి మరకలేని నేత…!

ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈ డి తాజాగా నోటీసులు పంపించింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ తో పాటుగా మరో ఇద్దరు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు పంపించింది. జనవరి 2, 3 తేదీల్లో వాళ్ళిద్దరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన దాన కిషోర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసేందుకు పిడి అధికారులు సిద్ధమయ్యారు.

Also Read : మంగళానికి జనసేన జై

ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది కాబట్టి ఏసీబీ విచారణ ఎంతవరకు కొనసాగుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా ఈ డి తో సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్