Saturday, June 20, 2026 11:53 PM
Saturday, June 20, 2026 11:53 PM

ఆ దేశంలో ఉంటే వచ్చేయండి… భారతీయులకు సర్కార్ వార్నింగ్

సిరియా అంతరుద్ద్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న తిరుగుబాటు దళాలు ఇప్పుడు దేశ రాజధానిపై గురి పెట్టాయి. జిహాదీ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాలో అతిపెద్ద అనగరమైన్న అలెప్పోతో సహా పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకుని క్రమంగా దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ సిరియా అంతర్యుద్ధంలో ఈ స్థాయిలో జీహాది గ్రూపులు ముందుకు కదలలేదు. దాదాపుగా అక్కడి సైన్యం కూడా చేతులు ఎత్తేసింది.

Also Read : కాంగ్రెస్‌ ఏడాది పాలన.. ఓల్డ్‌ సిటీకి గుడ్‌ న్యూస్‌..!

చివరికి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నివాస నగరం అయిన డమాస్కస్ వైపు వెళ్లాలని జిహాదీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం, తిరుగుబాటు దళాలు సిరియన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకు వచ్చాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దేశంలోని నాల్గవ అతిపెద్ద నగరమైన హమాలోని సెంట్రల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి తిరుగుబాటు దళాలు. హమాలో విజయం తిరుగుబాటుదారులకు ఒక వ్యూహాత్మక మైలురాయిగా చెప్పుకొచ్చింది అంతర్జాతీయ మీడియా. ఇప్పుడు కీలక నగరమైన హోమ్స్‌ పై దృష్టి సారించారు.

Also Read : ఆయన సీఎం పదవి ఐదేళ్లూ సేఫేనా…?

దీనితో ఆ దేశంలో ఉండే పౌరుల విషయంలో భారత్ అలెర్ట్ అయింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సిరియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయ పౌరులు సిరియాకు అన్ని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అక్కడ ఉన్న వారు అందుబాటులో ఉన్న విమానాలలో త్వరగా భారత్ చేరుకోవాలని హెచ్చరించింది. రాలేని వారు తమ భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సిరియాలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారని, వీరితో సహా 14 మంది వివిధ ఐఖ్యరాజ్య సమితి సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్