Tuesday, July 21, 2026 09:32 PM
Tuesday, July 21, 2026 09:32 PM

పాపం దాయది.. పేదరికం కోరల్లో పాకిస్తాన్..!

దాయాది దేశం పాకిస్థాన్‌ పేదరికం కోరల్లో చిక్కుకుని విలవిలాడుతోంది. గడిచిన ఆరేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోను కావడంతో నిరుపేదల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. వరుస ఆర్థిక సంక్షోభాలు, అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వృద్ధి రేటు వంటి కారణాలతో కుటుంబ ఆదాయాలు గణనీయంగా క్షీణించాయి. ఫలితంగా దేశ జనాభాలో దాదాపు 29 శాతం మంది పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారని ఒక తాజా నివేదిక వెల్లడించింది. 2018 – 19లో 21.8 శాతంగా ఉన్న పేదరికం, 2024 – 25 నాటికి 28.9 శాతానికి చేరింది. అంటే కేవలం ఆరేళ్లలోనే పేదరికం 7 శాతం పెరిగింది.

Also Read : పట్టు వదలని కాక్రోచ్ లు.. నేడు కూడా..!

హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే.. హెచ్ఐఈఎస్, పాకిస్థాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్.. పీఎస్ఎల్ఎం డేటా ఆధారంగా ‘డాన్’ పత్రిక విశ్లేషణను ప్రచురించింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత విడుదలైన ఈ గణాంకాలు.. దేశం ఎదుర్కొన్న బహుళ సంక్షోభాల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. గ్రామీణ పాకిస్థాన్‌లో పేదరికం సుమారు 8 శాతం మేర పెరగగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 6 శాతంగా నమోదైంది. పదే పదే తలెత్తిన చెల్లింపుల సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, దీర్ఘకాలిక స్థూల ఆర్థిక సర్దుబాట్లు వంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ పరిస్థితిని జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో ‘కోల్పోయిన దశాబ్దం’గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గత రెండు సర్వేల మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత చూస్తే, సగటు కుటుంబ ఆదాయాలు, వినియోగం గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఆర్ధిక వృద్ధి సానుకూలంగా ఉన్నప్పటికీ, పేదరికం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ వృద్ధి ఫలాలు ఎక్కువగా ఉన్నత ఆదాయ వర్గాలకే చేరాయని, దిగువ ఆదాయ వర్గాల వాస్తవ ఆదాయాలు, కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇది సూచిస్తోంది. పేద కుటుంబాలు ఎక్కువగా రోజువారీ వేతనాలపై ఆధారపడతాయి. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అంతరాయాల వల్ల ఈ వర్గాలే ఎక్కువగా నష్టపోయాయి.

Also Read : ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.. అన్‌స్టాపబుల్..!

మరోవైపు, సంపన్న వర్గాలు రియల్ ఎస్టేట్, ఆర్థిక పెట్టుబడుల వంటి ఆస్తులను కలిగి ఉండటంతో, ధరల పెరుగుదల ప్రభావాన్ని తట్టుకోగలిగారు. దీంతో దేశంలో ఆదాయ అసమానతలు మరింత పెరిగాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బాహ్య ఆర్థికపరమైన రిస్కుల మధ్య, పెరుగుతున్న పేదరికాన్ని, విస్తరిస్తున్న అసమానతలను పరిష్కరిస్తూనే ఆర్థిక వృద్ధిని కొనసాగించడం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్