Wednesday, June 3, 2026 08:37 PM
Wednesday, June 3, 2026 08:37 PM

అవి చేసే ముందు.. నటి ఘాటు వ్యాఖ్యలు..!

‘కాంతార చాప్టర్-2’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ నకిలీ వీడియోల వ్యవహారంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆమె ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న 29 ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారహంటూ నటి రుక్మిణి వసంత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వేరే వారి శరీరానికి తన ముఖాన్ని అతికించి, ఫేక్ విజువల్స్ సృష్టించారని రుక్మిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య తనను తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, ఉద్దేశపూర్వకంగా తన క్యారెక్టర్, ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేందుకే ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

రుక్మిణి వసంత్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, 9 ఇన్‌స్టాగ్రామ్, 14 ‘ఎక్స్’, 6 ఫేస్‌బుక్ పేజీలతో సహా మొత్తం 29 ఖాతాలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ చట్టంలోని సెక్షన్లు 66సి, 66డితో పాటు భారతీయ న్యాయ సంహిత.. బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై గతంలోనే రుక్మిణి ఘాటుగా స్పందించారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న చిత్రాలు పూర్తిగా ఫేక్ అని, వాటిని ఏఐ టెక్నాలజీతో సృష్టించారని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పష్టం చేశారు. “ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం, వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యం. ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే” అని ఆమె పేర్కొన్నారు.

Also Read : రాజ్యసభ కోసం బీజేపీ భారీ మాస్టర్ ప్లాన్..!

టెక్నాలజీని మంచి పనులకు వాడాలని, ఇలాంటి హానికరమైన కార్యకలాపాలకు కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. రుక్మిణి వసంత్.. 2007లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన అశోక చక్ర గ్రహీత, దివంగత కల్నల్ వసంత్ వేణుగోపాల్ కుమార్తె. ఆయన స్ఫూర్తిగానే ‘యూరి’ అనే బాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది. రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ప్రముఖ భరతనాట్య కళాకారిణి. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే ముందు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని రుక్మిణి వసంత్ భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం భక్తుల కష్టాలు...

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం....

బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా...

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని...

టీడీపీ ఖాతాలో మరో...

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ-3...

గెట్ రెడీ ఫర్...

తెలంగాణలో పోటీపై వస్తున్న పుకార్లకు జనసేన...

రాజ్యసభ కోసం బీజేపీ...

ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో...

పవన్ సభకు బ్రేకులు.....

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

పోల్స్