టాలీవుడ్ యంగ్ టైగర్.. ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని, తారక్ లుక్ విషయంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ కొట్టిపారేశారు. ఈ సినిమాపై టాలీవుడ్ జనాలు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియా జనాలు పండుగ చేసుకుంటున్నారు. ఈ టైంలో సినిమా వాయిదా పడిందనే ప్రచారం మొదలైంది.
Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!
దీనిపై రియాక్ట్ అయిన చిత్ర యూనిట్.. ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారమే సినిమా పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం స్పెషల్ గా రెడీ అవుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం తారక్ తన బాడీ లాంగ్వేజ్ ను, ఫైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చే పనిలో ఉన్నాడని తెలిపింది. ఈ సినిమాలో తారక్ పాత్ర మోస్ట్ పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
Also Read : కార్పొరేట్ ఆసుపత్రుల దందా.. లేడీ డాక్టర్ బయటపెట్టిన నిజం
దీని కోసం ఆయన ప్రస్తుతం కేరళలో అత్యంత పురాతన యుద్ధ విద్య అయిన కలరిపట్టు లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు అని ప్రకటించింది. సినిమాలో వచ్చే కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లలో ఈ విద్యను ప్రదర్శించబోతున్నాడని సమాచారం. తారక్ డెడికేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో డామినేషన్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు కనపడుతోంది. దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై కేవలం సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో.. భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే తారక్ కొత్త లుక్కు సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

