Tuesday, August 18, 2026 09:06 PM
Tuesday, August 18, 2026 09:06 PM

నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి నేడు కీలక, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘ఏపీ చట్ట సవరణ బిల్లు’ను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై చర్చ జరగనుండటంతో అటు ఢిల్లీలోనూ, ఇటు ఏపీలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొన్నేళ్లుగా రాజధాని మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి మనుగడపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Also Read : దుమారం రేపుతున్న కాగ్ నివేదిక..!

ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు లోక్ సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, అమరావతికి న్యాయపరమైన రక్షణ లభించడంతో పాటు, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లుపై జరిగే చర్చలో భాగంగా టీడీపీ తరపున ఐదుగురు ఎంపీలు తమ గళాన్ని వినిపించనున్నారు. అమరావతి ఆవశ్యకతను, గత ఐదేళ్లుగా అక్కడి రైతులు పడిన ఇబ్బందులను వారు సభ దృష్టికి తీసుకురానున్నారు.

Also Read : ట్రంప్ నోటి దూల.. వాళ్ళు బానిసల బిడ్డలు అంటూ వివాదాస్పద కామెంట్..!

వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగనుంది. అలాగే, జనసేన ఎంపీ బాలశౌరి కూడా ఈ చర్చలో పాల్గొని, అమరావతి అభివృద్ధికి ఈ చట్టబద్ధత ఎంత కీలకమో వివరించనున్నారు. మరోవైపు, ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉండటంతో, సభలో చర్చ ఆసక్తికరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం వెనుక అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను, పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కూడా ఉంది. చట్టబద్ధత లభిస్తే ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు రావడం సులభతరం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్