Friday, May 1, 2026 08:59 AM
Friday, May 1, 2026 08:59 AM

భారత్ వచ్చేయండి.. స్టూడెంట్స్, టూరిస్ట్ లకు కేంద్రం వార్నింగ్..!

ఇరాన్ – అమెరికా దేశాల మధ్య యుద్ద వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రాచ్య దేశాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు అన్ని దేశాలు తమ పౌరుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇరాన్‌లోని భారత పౌరులు అక్కడి నుంచి స్వదేశానికి రావాలని విదేశాంగ శాఖ సూచించింది. భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పలు హెచ్చరికలు చేసింది.

Also Read : అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు..!

వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ ను విడిచి వెళ్లాలని తన పౌరులను కోరింది. ఈ సలహా ఇరాన్‌లోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అందరూ దేశానికి తిరిగి రావాలని సూచించింది. జనవరి 14, 2026 నాటి సలహా ప్రకారం, భారత పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.

Also Read : భారత్ సెమీస్ చేరాలంటే.. ఇది జరగాల్సిందే..!

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి క్షేమంగా ఉండాలని తెలిపింది. స్థానిక మీడియాను చూసి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవాలని కోరింది. ఇరాన్‌ లోని భారతీయులు తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు పత్రాలు సహా, ప్రతీ ఒక్కటి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లు, ఇమెయిల్‌లను కూడా ప్రకటించింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359. ఇమెయిల్: cons.tehran@mea.gov.in ఇరాన్‌లోని భారత పౌరులు.. భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్