Sunday, September 20, 2026 10:33 AM
Sunday, September 20, 2026 10:33 AM

భారత్ కు ఇరాన్ తలనొప్పి..? ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్..?

మధ్యప్రాచ్యంలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ద తీవ్రత గల్ఫ్ దేశాలతో పాటుగా యూరప్ దేశాలను కలవరపెడుతోంది. మధ్యప్రాచ్యంలో తమ మాట వినని ఇరాన్ విషయంలో అమెరికా సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. ఇరాన్ సమీపానికి యుద్ద నౌకలు చేరుకున్నాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ తీర ప్రాంతానికి కేవలం.. దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ చేసారు.

Also Read : ఆ నేతకు బ్రేకులు ఎందుకు వేయలేకపోతున్నారు..?

మరో యుద్ద నౌక ఇరాన్ కు సమీపంలోనే ఉండవచ్చు అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ రిపబ్లిక్‌ ను నాశనం చేయడంలో అమెరికన్ సైనిక బలం విజయం సాధించే అవకాశం లేదన్నారు. ఒక అమెరికన్ యుద్ధనౌక మునిగిపోవచ్చని కూడా హెచ్చరించడం గమనార్హం. ఆ రెండు సంకేతాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో, ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. రెండు దేశాల మధ్య రాజీ కోసం జెనీవా కేంద్రంగా చర్చలు జరుపుతోంది.

Also Read : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాలో అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలోని కొన్ని భాగాలను ఇరాన్ సర్కార్ తాత్కాలికంగా మూసివేయడంతో ఆందోళన మొదలైంది. 60 శాతం చమురు ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. మూసివేత దీర్ఘకాలికంగా కొనసాగితే భారత్ సహా పలు దేశాల ఆయిల్ ధరలపై ప్రభావం పడుతోంది. 1980ల నుంచి ఇప్పటి వరకు మూసివేయలేదు. ఆసియా మార్కెట్ లపై దీని ఎఫెక్ట్ ఎక్కువ. ఇజ్రాయిల్ తో యుద్ధం సమయంలో కూడా ఈ జల సంధిపై ఆందోళన వ్యక్తమైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్