ఈరోజుల్లో చాలా మంది చిరుతిళ్ళ మీద చూపించిన శ్రద్ద పళ్ళ మీద చూపించరు . వాటి వల్ల కలిగే ఉపయోగాల మీద చాలా మందికి అవగాహన లేదు , అలాగే కూరగాయలు కూడా మనకెంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజు ఐదు పళ్లు, కూరగాయలు తింటే, మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే వారి రోగ నిరోధక శక్తి ఎంతో వృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు.ప్రతి రోజు పచ్చికూరగాయలు గానీ, ఐదు పళ్లు గానీ, తినడం వల్ల శరీర మెటాబాలిజం చాలా మెరుగుపడే అవకాశం ఉందని వారంటున్నారు. చర్మం కూడా కాంతివంతంగా తయారవ్వాలంటే కూడా పళ్లు తినాలని చెబుతున్నారు. ఇవే కాకుండా వివిధ పళ్లు సీజన్ను బట్టి దొరుకుతుంటాయి. వాటిని తినడం వల్ల కూడా మంచి ప్రోటీన్లు శరీరానికి అందే అవకాశం ఉందని, అందువల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరిగుతుందని , నిపుణులు అంటున్నారు. పళ్లల్లో ఉండే ప్రోటీన్ల వల్ల ఒక్కో పండు ద్వారా 400 గ్రాముల శక్తి లభిస్తుందని వారు అంటున్నారు. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాల్లో పళ్ళు కూడా ఒకటి నిపుణులు చెప్పినట్టు చేస్తే వచ్చే ఉపయోగాలు ఉన్నాయో లేదో చూడండి ఆరోగ్యంగా ఉండి !