Sunday, June 21, 2026 02:55 PM
Sunday, June 21, 2026 02:55 PM

హైదరాబాద్ నవాబ్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా..!

మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఒకప్పుడు అతన్ని తిట్టిన వాళ్ళే అతని కమిట్మెంట్ చూసి ఫిదా అయిపోతున్నారు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్న టైం లో జట్టులోకి వచ్చిన సిరాజ్.. అప్పటి నుంచి జట్టుకి ప్రతీ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల సీరీస్ కు, ఆస్ట్రేలియా పర్యటనకు, ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ప్రతీ మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడు.

Also Read : రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?

ఆస్ట్రేలియా టూర్ లో 5 మ్యాచ్ లు ఆడిన సిరాజ్, ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో కూడా 5 మ్యాచ్ లు ఆడాడు. బూమ్రా మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. కాని సిరాజ్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఫిట్నెస్ కారణంగా, వర్క్ లోడ్ కారణంగా తప్పుకోలేదు. బూమ్రా లేని సమయాల్లో జట్టుకు అత్యంత కీలకంగా మారుతున్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న సీరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు సిరాజ్. మొత్తం 18 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.

Also Read : టీంలో ఆ ఒక్కడికే ఎందుకీ ఈ అన్యాయం..?

మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో 157 ఓవర్లు వేసిన సిరాజ్, ఈ సీరీస్ లో 156 ఓవర్లు వేసాడు. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ కీలకం కానున్నాడు. దీనితో అతనిని ఇండియన్ పేస్ అటాక్ కు లీడర్ అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచ క్రికెట్ లో ఇంత కంటిన్యూగా మ్యాచ్ లు ఆడుతున్న బౌలర్ మరొకరు లేరు. ఆస్ట్రేలియా సీరీస్ లో సిరాజ్ పై విమర్శలు వచ్చినా, ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్