Thursday, February 5, 2026 09:44 PM
Thursday, February 5, 2026 09:44 PM

మళ్ళీ ఢిల్లీకి బాబు.. ఏపీకి మోడీ

2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన సిఎం చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సిఎం.. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కారి, సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. విభజన హామీలపైనే ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ఆ విషయంలో ఒంటరైన నాని..!

మరోసారి నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ సంస్థ కార్యాలయ శంకుస్థాపనకు మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు కూడా ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల కాలంలో ప్రధాని రెండు సార్లు రాష్ట్రానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. అమరావతి పనుల ప్రారంభం, యోగాంధ్ర కార్యక్రమానికి మోడీ వచ్చారు.

Also Read : తీన్మార్ రచ్చ.. కేసుల గోల..!

పలు దేశాల పర్యటనకు వెళ్ళిన మోడీ.. జులై 9 న దేశానికి తిరిగి వచ్చారు. అటు అమరావతికి కేంద్రం ఇచ్చిన గ్రాంట్ పై కూడా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాల్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉండవచ్చు. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి మళ్ళీ తెలంగాణాలో ఎన్డియే కూటమి పోటీ గురించి చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్