ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె రిసెప్షన్ కు పవన్ హాజరు కానున్నాయి. ఇక ఇదిలా ఉంటే నేడు ఏపీ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి ల గ్రూప్ ఫోటో సందర్భం గా డిప్యూటీ సిఎం , మాజీ మంత్రి బొత్స మధ్య సంభాషణ ఆసక్తిని రేపింది.
Also Read : అసెంబ్లీలో ధూళిపాళ్ళ సంచలన డిమాండ్
ఎలా వున్నారు అంటూ డిప్యూటీ సిఎం ను బొత్స పలకరించారు. గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళుతూ మరోసారి కాసేపు డిప్యూటీ సిఎంతో బొత్స మాట్లాడారు. ఢిల్లీ నుండి వచ్చాక ఎప్పుడు సభకు వస్తారని బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెబితే కొల్లేరు లో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల గురించి తాను కలుస్తాను అని బొత్సా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొల్లేరు వాసుల అభ్యర్థనను డిప్యూటీ సిఎం కు దృష్టికి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చారు.
Also Read : ఢిల్లీలో చంద్రబాబు, పవన్ రాజకీయం..!
సుప్రీం కోర్టు లో కేస్ వేయడంతో ఈ నెల 9 నుండి సర్వే నిర్వహిస్తున్నది అటవీ శాఖ. మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్ లో సుప్రీం కోర్టు ఆదేశించింది. రేపు సుప్రీం కోర్టు లో కొల్లేరు వ్యాజ్యం పై విచారణ జరగనుంది. దీనితో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆ రైతుల డేలిగేషన్ తో వచ్చి కలుస్తాను టైం ఇవ్వాలని బొత్స కోరగా… ఢిల్లీ నుంచి రాగానే సమయం ఇస్తామని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

