Wednesday, May 6, 2026 09:51 PM
Wednesday, May 6, 2026 09:51 PM

రిలీజ్ కు ముందే వార్ 2 భారీ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ నటించిన యాక్షన్ థ్రిల్లర్, వార్ 2. బాలీవుడ్ జనాల కంటే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ తర్వాత నుంచి వస్తున్న సినిమా ఇదే. దీనితో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మించారు.

Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!

ఆగస్ట్ 15 సందర్భంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. హిందీ, తమిళం, తెలుగు భాషలలో పాన్-ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమ్మా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం 70 కోట్ల వరకు తీసుకుంటున్న ఎన్టీఆర్.. తెలుగులో వచ్చే లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడు అని టాక్. దీనిపై జాతీయ మీడియా ఓ న్యూస్ ప్రచురించింది. తెలుగులో ప్రమోషన్ బాధ్యత ఎన్టీఆర్ కు ఇచ్చినట్టు సమాచారం.

Also Read : ఆ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్..!

బాలీవుడ్ న్యూస్ ప్రకారం.. ఈ సినిమా హక్కులను నాగ వంశీ దాదాపు 90 కోట్లకు కొన్నట్టు టాక్. 400 కోట్ల బడ్జెట్ లో 90 కోట్లు వెనక్కు వచ్చేసాయని, థియేటర్ లాభాలు అన్నీ నాగ వంశీనే తీసుకుంటాడు అంటూ కథనం వచ్చింది. నాగ వంశీతో ఎన్టీఆర్ ఒప్పందం ప్రకారం.. ఎన్టీఆర్ కు లాభాల్లో వాటా రానుంది. ఇక హృతిక్ రోషన్ కు అడ్వాన్స్ గా 50 కోట్లు ఇచ్చింది యష్ రాజ్ ఫిలిమ్స్. సినిమా లాభాల్లో కూడా అతనికి వాటా ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్