Sunday, June 21, 2026 06:16 AM
Sunday, June 21, 2026 06:16 AM

తిరుమలలో ఆసక్తి రేపుతున్న న్యాయ విచారణ

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో ఇప్పుడు విచారణ వేగవంతం చేసారు. ఈ ఘటనలో బాధ్యులు ఎవరు అనే దానిపై న్యాయ విచారణ జరుగుతోంది. తిరుపతి కలెక్టరేట్ లో న్యాయవిచారణ కమిషన్ విచారిస్తోంది. తొక్కిసలాట ఘటన పై మూడో దశ విచారణ మొదలైంది. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందగా.. 44 మంది భక్తులు గాయపడ్డారు. విచారణ కమిషన్ హెడ్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సత్యనారాయణమూర్తిని నియమించారు.

Also Read : బాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా..?

ఇప్పటికే రెండు దశల్లో విచారణ పూర్తి చేయగా బాధితులు, సాక్షులను నేరుగా వర్చువల్ గా విచారించింది కమీషన్. ఈ నెల 14 నుంచి మూడు రోజులపాటు తిరుమలలో పర్యటించిన కమిషన్… భక్తుల క్యూలైన్లు, టిటిడి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు సత్యనారాయణమూర్తి. నేటి నుంచి మూడు రోజుల టీటీడీ ఈవో, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను కమిషన్ విచారిస్తుంది. ఈ రోజు కమిషన్ ముందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు.

Also Read : వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!

19 న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, మాజీ టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ కుమార్, 13 మంది టీటీడీ జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు సిఐలు, 6 మంది ఎస్ఐలు హాజరు కానున్నారు. ఈ నెల 20 న, సీవీఎస్ఓ, మాజీ సీవీఎస్ఓలను విచారించనున్నారు. 21 నుంచి 23 వరకు మూడు రోజులు 42 మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాప్, 32 మంది పోలీసు సిబ్బందిని విచారించనున్నారు. దీనితో ఈ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్