Thursday, May 7, 2026 01:23 AM
Thursday, May 7, 2026 01:23 AM

భారతీయ విద్యార్ధులకు ట్రంప్ గుడ్ న్యూస్..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత్ సహా అనేక దేశాల పౌరులను ఆందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. హెచ్ 1 బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికా వెలుపల నుంచి వెళ్ళే వారికి లక్ష డాలర్ల ఫీజు విధించారు డోనాల్డ్ ట్రంప్. దీనితో హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్ళాలి అనుకునే వారి కలలు ఒక్కసారిగా కూలిపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో చాలా మంది ఆలోచన విరమించుకున్నారు.

Also Read : విలువల్లేని బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ

వీసా రెన్యువల్ విషయంలో కూడా అదే వర్తించడం భయపెట్టింది. ఈ నేపధ్యంలో తాజాగా ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో సహా ప్రస్తుత అమెరికా వీసా హోల్డర్ లకు ఉపశమనం కలిగించారు. అమెరికాలో ఉండే విద్యార్ధులకు.. లక్ష డాలర్ల ఫీజు వర్తించదు అని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 న ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పుడు.. అందరికి వర్తిస్తుందని అమెరికా స్పష్టం చేసింది. కానీ కార్పోరేట్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయంలో మార్పులు చేసింది.

Also Read : పాక్ ఏడుపు అందుకే.. ఆఫ్ఘన్ మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..!

అక్టోబర్ 20న విడుదల చేసిన మార్గదర్శకాల్లో విద్యార్ధి దేశం విడిచి వెళ్ళకుండా అమెరికాలోనే ఉంటే.. లేదంటే అమెరికాలో ఉండేందుకు అప్లికేషన్ దాఖలు చేస్తే హెచ్ 1 బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు ఉండదు. అలాగే అమెరికా వెలుపల ఉన్న హెచ్ 1 బీ వీసాతో ఉన్న కార్మికులు.. దేశం బయట ఉన్నా.. లోపల ఉన్నా సరే, కొత్త అప్లికేషన్ పై నిర్ణయం వచ్చే వరకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని అమెరికా సర్కార్ పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్