Tuesday, August 4, 2026 07:40 PM
Tuesday, August 4, 2026 07:40 PM

భారత్ సెమీస్ చేరాలంటే ఈ లెక్కలే కీలకం..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టుకు కష్ట కాలం నడుస్తోంది. జట్టుని ప్రకటించిన తర్వాత గాయాలు, ఆ తర్వాత లీగ్ దశలో కష్టంగా విజయాలు సాధించడం, ఆ తర్వాత సూపర్ 8 లో సఫారీలపై భారీ ఓటమి.. అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక తాజాగా జింబాబ్వేపై మంచి విజయం సాధించినా.. భారత జట్టుకు ఇబ్బందులు తప్పేలా కనపడటం లేదు. ఇతర జట్ల విజయాలపై భారత్ ఆధారపడాల్సిన పరిస్తితి ఇప్పుడు ఏర్పడింది. మరి భారత్ సెమీస్ కు క్వాలిఫై కావాలంటే ఏం చేయాలో చూద్దాం.

Also Read : టఫ్ టైం.. అతను తుది జట్టులో ఉంటాడా..?

ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్‌ ను భారత్ ఓడిస్తే సెమీఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఓడిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. వెస్టిండీస్ గెలిస్తే మాత్రం.. సఫారీలు జింబాబ్వే మీద భారీ తేడాతో ఓడిపోతేనే భారత్ అర్హత సాధిస్తుంది. కానీ ఇక్కడ మరో కీలక విషయం ఏంటీ అంటే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం వెస్టిండీస్ జట్టు సెమీస్ కు వెళ్తుంది. కారణం నెట్ రన్ రేట్. అప్పుడు భారత్ కు విండీస్ కు 3 పాయింట్ లు ఉంటాయి. 4 పాయింట్లతో సఫారీలు సెమీస్ కు వెళ్తారు.

Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక

ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో గెలిచినా విమర్శలు తప్పడం లేదు. ముఖ్యంగా శివం దూబేకి బౌలింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, బూమ్రాకి రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయినా సరే.. దూబేకి బౌలింగ్ ఇచ్చారు. అతను రెండు ఓవర్లలో మొత్తం 46 పరుగులు ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్ లో కూడా అతను చురుకుగా కనపడలేదు. దీని కారణంగా నెట్ రన్ రేట్ ప్రభావితం అయింది. భారీ తేడాతో గెలిచినా ఇంకా మైనస్ లోనే రన్ రేట్ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్