Sunday, June 21, 2026 04:47 AM
Sunday, June 21, 2026 04:47 AM

అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ వేడుకలు జరుపుకోవడానికి బెంగళూరు వెళ్ళగా.. అక్కడ చోటు చేసుకున్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కర్ణాటక హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బెంగళూరు పోలీస్ కమిషనర్ తో పాటుగా పలువురు అధికారులు పై కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : ఆర్సీబీ సంచలన నిర్ణయం

ఇక అక్కడికి వచ్చిన వారిలో విరాట్ కోహ్లీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో కోహ్లీ పై విమర్శలు చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. దీనిపై సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ అరెస్టు కోహ్లీ అనే ట్యాగ్ విస్తృతంగా వైరల్ అవుతుంది. కోహ్లీ కారణంగానే అభిమానులు అంతమంది వచ్చారని.. కాబట్టి దీనికి బాధ్యతగా కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం వెంటనే కోహ్లీని అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కరోనా.. శాస్త్రవేత్త సంచలన కామెంట్స్

అలాగే మృతల కుటుంబాలకు విరాట్ కోహ్లీ భారీగా ఆర్థిక సహాయం చేయాలనే డిమాండ్ కూడా వినపడుతోంది. ఇదిలా ఉంచితే ఈ ఘటనలో మరణించిన వారికి ఆర్సిబి యాజమాన్యం ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. గాయపడిన వారికి కూడా అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆర్సిబి యాజమాన్యానికి అండగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విషయంలో కూడా సోషల్ మీడియాలో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్