Friday, May 29, 2026 09:37 PM
Friday, May 29, 2026 09:37 PM

కొడుకు కోసం మాజీ సీఎం ఆరాటం..!

కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో చర్చల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కీలక భేటీ ముగిసిన అనంతరం, సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడ కేబినెట్ స్థానాలు, సామాజిక సమీకరణాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖరారైన సంగతి తెలిసిందే.

Also Read : సెక్స్ వర్కర్లపై పోలీసు దాడులపై సుప్రీం సంచలన తీర్పు..!

ఇక ఈ చర్చల్లో భాగంగా సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు నూతన కేబినెట్‌ లో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. యతీంద్రకు విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేటాయించాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సిద్ధరామయ్య గట్టిగానే పట్టుబడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరలేపుతోంది.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో సంచలనం..!

కర్ణాటక నూతన కేబినెట్‌ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. ఇందులో లింగాయత్ సామాజికవర్గం నుంచి ఒకరికి, ఎస్సీ సామాజికవర్గం నుంచి మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం రేసులో నలుగురు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, ఎం.బి.పాటిల్, మరియు జర్కిహోళి ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బొల్లా బ్రహ్మనాయుడు పరార్.....

సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక...

కుల పిచ్చి దాటడమే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ...

ఏపీకి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలోని...

సెక్స్ వర్కర్లపై పోలీసు...

దేశంలో మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు...

ఏపీ లిక్కర్ స్కామ్‌...

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న...

కష్టపడిన వారికి గుర్తింపు...

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది...

పోల్స్