Friday, May 29, 2026 08:34 PM
Friday, May 29, 2026 08:34 PM

ఏపీ లిక్కర్ స్కామ్‌ లో సంచలనం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వరరెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఆయనకు సంబంధించిన బినామీలను సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read : టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్.. రసవత్తరమైన పోరు

నాగేశ్వరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తన పరపతిని ఉపయోగించుకుని వందల కోట్ల రూపాయల కబ్జాలు, అక్రమ వసూళ్లు, భూ సెటిల్మెంట్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సంపాదనతో విజయవాడలోని ఒక ప్రముఖ కార్ల షోరూమ్‌ లో భారీగా వాటాలు కొనుగోలు చేసినట్లు సిట్ నిర్ధారించింది. అంతేకాకుండా, తన బావమరిది భాగస్వామ్యంతో ఒక పెద్ద సాఫ్ట్‌ వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. నాగేశ్వరరెడ్డి సాగించిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఒక ప్రవాస భారతీయుడిని తీవ్రంగా బెదిరించి, కృష్ణా జిల్లా పరిధిలోని సుమారు 40 ఎకరాల విలువైన భూమిని ఆయన స్వాహా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. దీనితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని ప్రసిద్ధ హాథీరామ్ జీ మఠానికి చెందిన విలువైన భూములను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం స్థిరాస్తులు, వ్యాపారాలే కాకుండా నగదు, బంగారం రూపంలో కూడా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.

Also Read : బెంబేలెత్తిస్తున్న ఎబోలా.. హైఅలర్ట్..!

నాగేశ్వరరెడ్డి భార్య పేరిట సుమారు రెండున్నర కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే ఆమెకు సంబంధించిన ఒకే ఒక బ్యాంక్ అకౌంట్‌లో ఏకంగా రూ.19.85 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించి అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ నిధుల మూలాలపై సిట్ మరిన్ని బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బొల్లా బ్రహ్మనాయుడు పరార్.....

సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక...

కుల పిచ్చి దాటడమే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ...

ఏపీకి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలోని...

సెక్స్ వర్కర్లపై పోలీసు...

దేశంలో మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు...

కష్టపడిన వారికి గుర్తింపు...

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది...

అధికారం కోసం విధ్వంసం.....

బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్...

పోల్స్